mt_logo

జాతీయ క్రీడల్లో కొనసాగుతున్న తెలంగాణ క్రీడాకారుల హవా… అభినందించిన మంత్రి కేటీఆర్

గుజరాత్ లోని బావ్ నగర్ లో జరుగుతున్న 36వ జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకు మనవాళ్లు మొత్తం 18 పతకాలు (7 స్వర్ణాలు, 7 రజతాలు, 4 కాంస్యాలు) ఖాతాలో వేసుకొని పట్టికలో 14వ స్థానంలో కొనసాగుతున్నారు. గురువారం మహిళల బాస్కెట్‌బాల్‌లో మన అమ్మాయిలు పసిడి పతకం కైవసం చేసుకున్నారు. మహిళల 5X5 ఫైనల్లో తెలంగాణ 67-62తో తమిళనాడుపై విజయం సాధించింది. అంతకుముందు హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో మన అమ్మాయిలు 88-82తో కేరళను చిత్తుచేశారు.

కాగా బాస్కెట్‌బాల్‌లో పసిడి పతకం గెలిచిన బాలికలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *