mt_logo

టీఆర్‌ఎస్‌ పార్టీ మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని… సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఉద్యమకారుడిగా పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే కోరుకుంటూ స్థానిక నాయకులు, కార్యకర్తలు, జిల్లా పార్టీ నాయకత్వం, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టలను పరిశీలించిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి 2003 నుంచి టీఆర్‌ఎస్‌లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. తెలంగాణలో జరిగిన పలు ఉపఎన్నికల్లో పార్టీ విజయానికి కృషిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2018లో జరిగిన ఎన్నికల్లో పరాజయంపాలయ్యారు. అప్పటినుంచి మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *