mt_logo

హిందీ తప్పనిసరి చేయడం వ్యతిరేకిద్దాం : మంత్రి కేటీఆర్ పిలుపు

ఐఐటీలు, కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో హిందీని తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలని తెలియజేస్తూ… కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని మంత్రి కేటీఆర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.

‘భారతదేశానికి జాతీయ భాషంటూ ఏదీలేదు. అన్ని భాషల్లాగే హిందీ కూడా ఒక అధికార భాష మాత్రమే. ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో హిందీని తప్పనిసరి చేస్తున్నారు. తద్వారా ఎన్డీఏ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నది. భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలి. హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిద్దాం’ అని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *