mt_logo

ఏపీఎన్జీవోల ధర్నాలో లగడపాటి బోల్తా!!

సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ సమైక్యవాదులు రెండోసారి హైదరాబాదులో తలపెట్టిన ధర్నా తెలంగాణ వాదుల ఆందోళనలతో రసాభాసగా మారింది. ఈ ధర్నాలో విజయవాడ ఎంపీ లగడపాటి, గాదె వెంకటరెడ్డి, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. లగడపాటి సినిమా డైలాగులతో తెలంగాణ వాదాన్ని కించపరుస్తూ, భోగిమంటల్లో తెలంగాణ బిల్లు కాల్చివేయడం టీ వాదులకు చెంపపెట్టు అని తొడగొట్టి మాట్లాడుతుండగా టీవైఎస్ నేతలు లగడపాటిని స్టేజిమీదనుండి కిందికి లాగి పడేసారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై అక్కడే ఉన్న కొంతమంది తెలంగాణ వాదులను అరెస్ట్ చేశారు. లగడపాటి కేసీఆర్ ను, తెలంగాణ వాదాన్ని కించపరుస్తూ మాట్లాడటం వల్లే నిరసన తెలిపామని నాగేశ్వర్, రాజు, బండి కిరణ్ ప్రకాష్ అన్నారు. ధర్నాకు టీవాదులు ఆటంకం కల్పిస్తారని ముందుజాగ్రత్తగా పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా బృందాలుగా తెలంగాణ వాదులు ధర్నాలోకి ప్రవేశించి జై తెలంగాణ నినాదాలు చేశారు. అశోక్ బాబు ఎన్నోసార్లు తెలంగాణవాదులను పట్టించుకోవద్దని అక్కడున్న సమైక్యవాదులకు చెప్పుకోవాల్సి వచ్చింది. గాదె వెంకటరెడ్డి ప్రసంగం సమయంలో కూడా తెలంగాణ వాది ఆకుల శ్రీనివాస్ జై తెలంగాణ నినాదం చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన కానిస్టేబుల్ శ్రీనివాస్ జై తెలంగాణ నినాదంతో వేదిక వద్దకు దూసుకెళ్లాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *