ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలవ్వగానే వైసీపీ సమైక్య తీర్మానాన్ని సభలో ప్రవేశబెట్టమని కోరగా దానికి స్పీకర్ తిరస్కరించారు. అయినా సభ్యులు పట్టువీడకపోవడంతో సభ పదిహేను నిమిషాలు వాయిదా పడింది. వాయిదా అనంతరం తెలంగాణ బిల్లుపై చర్చ మొదలవ్వగానే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ముఖ్యమంత్రి ప్రసంగం పూర్తయ్యిందా? లేదా? అనే విషయంపై స్పష్టత కావాలని స్పీకర్ ను కోరారు. సభ్యుల ప్రసంగాల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి ప్రసంగం కొనసాగుతుందని స్పీకర్ చెప్పారు. ముందుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, సీమాంధ్ర పాలకులు తెలంగాణ ప్రాంతానికి కనీసం తాగడానికి మంచినీళ్ళను కూడా ఇవ్వలేదని, తెలంగాణ ఏర్పాటుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి బుధవారం సభలో సభానాయకుడిగా మాట్లాడారా? లేక పీలేరు ఎమ్మెల్యేగా మాట్లాడారా? అనే విషయం చెప్పాలన్నారు. పదవీకాలం ముగుస్తుందని వందలాది ఫైళ్ళను క్లియర్ చేసి దగా చేశారని సీఎం కిరణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షనేత చంద్రబాబు సమన్యాయం అంటూ డిమాండ్ లేని దీక్ష చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణకోసం నిధులు అడిగితే సీఎం ఒక్క పైసా ఇవ్వనన్నారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మాట్లాడుతూ, తెలంగాణ బిల్లును స్వాగతిస్తున్నామని, సీమాంధ్రులు మా వనరులు దోచుకున్నారని, మా ప్రాంత అభివృద్ధికే తెలంగాణ అని వివరించారు. ప్రజాఉద్యమ ఫలితమే తెలంగాణ అని సీపీఐ ఎమ్మెల్యే చంద్రావతి అన్నారు. తెలంగాణ వస్తే మేము కోల్పోయిన ఉద్యోగాలు మళ్ళీ మాకు వస్తాయనే ఆశతో తెలంగాణ ప్రజలు ఉన్నారని ఆమె చెప్పారు. రాష్ట్రపతి ఇచ్చిన గడువు ముగియనుండటంతో బిల్లుపై చర్చను ఈ మధ్యాహ్నం 2గంటలకు ముగించాలని తెలంగాణ ఎమ్మెల్యేలు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను కలిసారు. బిల్లును రాష్ట్రపతికి పంపాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. టీడీపీ సభ్యుల ఆందోళనలతో సభ ఐదు నిమిషాలపాటు వాయిదా పడింది. టీ బిల్లుపై గడువు పెంచుతూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ నెల 30 వరకు శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. దీనిపై చర్చించేందుకు రేపు మరోసారి బీఏసీ సమావేశం జరపనున్నట్లు తెలిసింది. టీడీపీ సభ్యుల ఆందోళనతో వాయిదా పడ్డ అసెంబ్లీ మళ్ళీ ప్రారంభమయ్యాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సీఎంపై సభాహక్కుల ఉల్లంఘన చర్య తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. తెలంగాణలో సాగుభూమి పెరిగిందని, తెలంగాణలోనే ప్రాజెక్టులకు ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెవిలో పువ్వులతో నిరసన తెలిపారు. దీంతో సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హరీశ్ రావును నోరు అదుపులో పెట్టుకోమని అన్నారు. సీఎం ప్రసంగం అసత్యాలతో ఉందని టీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుండటంతో సభ మరో 10 నిమిషాలు వాయిదా పడింది.
- Telangana faces injustice in union railway budget too
- Gift A Smile: KTR distributes laptops to 100 students at State Home on his birthday
- Revanth becomes a laughing stock at national level over ‘family politics’ remarks
- No funds for Telangana’s Regional Ring Road in union budget
- Loans waived for farmers who never took them: Kamareddy farmers suspect fraud
- పారిస్ ఒలింపిక్స్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన కేటీఆర్
- శ్రీధర్ బాబు ముందరి కాళ్లకు బంధం వేస్తున్నదెవరు? (పార్ట్-1)
- నీళ్లు వృథా పోతుంటే ఎత్తిపోయకుండా రైతుల నోట్లో మట్టి కొడతారా: కేటీఆర్
- ఆగస్టు 2 గడువు.. తర్వాత 50 వేల మంది రైతులతో కన్నెపల్లి పంప్ను స్టార్ట్ చేస్తాం: కేటీఆర్
- ఎండిపోతున్న ఎల్ఎండీ, మిడ్ మానేరు, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ సహా అన్ని రిజర్వాయర్లు నింపాలి: కేటీఆర్
- ఎన్నికల్లో గ్యారెంటీల గారడీ.. ఇప్పుడు అంకెల గారడీ.. ఇది దశా, దిశా లేని బడ్జెట్: హరీష్ రావు
- ఐఐటీ గౌహతిలో సీటు సాధించిన నిరుపేద విద్యార్థిని దీప్తికి కేటీఆర్ అండ
- ఒక పద్దు లేదు.. పద్ధతి లేదు.. బడ్జెట్ అంతా గ్యాస్.. ట్రాష్: కేసీఆర్
- మేడిగడ్డ బరాజ్లో సమస్య ఎందుకు వచ్చింది? మేడిగడ్డ గురించి తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు
- గిఫ్ట్ ఏ స్మైల్: ఆత్మహత్య చేసుకున్న 13 మంది నేత కార్మికుల కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక సహాయం