mt_logo

రాజ్యాంగ పరిరక్షణే అంబేద్కర్‌కి మనమిచ్చే నిజమైన నివాళి: కేటీఆర్

డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఘనమైన నివాళి అర్పించారు. సామాజిక న్యాయమే నినాదంగా.. భిన్నత్వంలో ఏకత్వమే విధానంగా.. లౌకిక వాదాన్ని కాపాడటమే లక్ష్యంగా.. అణగారిన వర్గాల అభ్యున్నతే ఆదర్శంగా..సమసమాజ నిర్మాణమే నిజమైన సందేశంగా అంబేద్కర్ పోరాడారు అని అన్నారు.

సమాఖ్య స్పూర్తిని కాపాడటమే తక్షణ కర్తవ్యంగా.. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని.. సగర్వంగా అందించిన విశ్వమానవుడు..
భారతరత్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఘనమైన నివాళి అని కేటీఆర్ పేర్కొన్నారు.

బాబాసాహెబ్ చూపిన బాటలోనే మన తెలంగాణ మనం తెచ్చుకున్నం.. రాష్ట్ర సచివాలయానికి సగర్వంగా డా.బీ.ఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నం అని గుర్తు చేసుకున్నారు.

ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహాన్ని ఎంతో ఘనంగా ఆవిష్కరించుకున్నం.. సమున్నత విజ్ఞాన మూర్తిని గుండెల నిండా గౌరవించుకున్నం అని పేర్కొన్నారు.

అంబేద్కర్ గారి ఆశయాలే స్ఫూర్తిగా సమగ్ర.. సమీకృత.. సమ్మిళిత.. సమతుల్య.. అభివృద్ధికి శక్తివంచన లేకుండా పదేళ్లు శ్రమించినం. అంబేద్కర్ గారి ఆలోచనలు విశ్వజనీనం.. వాటిని అక్షరాల ఆచరించడమే మనందరి లక్ష్యం అని కేటీఆర్ అన్నారు.

బాబాసాహెబ్ గారి సిద్ధాంతాలు.. సార్వజనీన వాటిని భవిష్యత్ తరాలకు అందించడమే మన స్వప్నం. ఓవైపు.. రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేసి.. వాటిని నిర్వీర్యం చేసే కుట్రలు మరోవైపు.. ప్రజాస్వామ్యాన్నే కాలరాసి..  రాజ్యాంగ సంస్థలను చెప్పుచేతల్లో పెట్టుకునే కుతంత్రాలు.. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో భారత సమాజంపై ఉన్న బాధ్యత ఒక్కటే.. రాజ్యాంగ పరిరక్షణే డా. బీ.ఆర్. అంబేద్కర్ గారికి నిండుమనసుతో మనమిచ్చే నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు.