mt_logo

సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం కేసీఆర్‌కే సాధ్యమైంది: అంబేద్కర్ జయంతి వేడుకల్లో కేటీఆర్

తెలంగాణ భవన్‌లో జరిగిన భారతరత్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.

బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టే బోధించు, సమీకరించు, పోరాడు అనే స్పూర్తితోనే లక్షలాది మందిని సమీకరిస్తూ 14 ఏళ్లపాటు తెలంగాణ పోరాటాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో కొనసాగించాం. ప్రజా పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని అన్నారు.

సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశీర్వాదంతో, అంబేద్కర్ ఆశయాల ఆలోచనల మేరకు పది సంవత్సరాలు మా ప్రభుత్వం పనిచేసింది. విద్యతోనే వికాసం వస్తుంది, వికాసంతోనే ప్రగతి వస్తుంది, ప్రగతి తోనే సమానత్వం వస్తుంది అన్న ఆయన ఆలోచనతో 1,022 గురుకులాలు పెట్టుకున్నాం అని గుర్తు చేశారు.

వీటినుంచి బయటకు వచ్చిన లక్షల పదిమంది భవిష్యత్తు తెలంగాణ పౌరులు ఈరోజు అనేక ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్నారు. వీరందరూ జీవితంలో పైకి వచ్చినప్పుడు సమాజంలో అసమానతలు తొలగుతాయి అని పేర్కొన్నారు.

125 ఫీట్ల ప్రపంచంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. మేము ఏర్పాటు చేసింది విగ్రహం కాదు విప్లవం అనే మాటను కేసీఆర్ గారు చెప్పారు. సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం అది కేసిఆర్ గారికే సాధ్యమైంది అని తెలిపారు.

బాబా సాహెబ్ అంబేద్కర్ అందరి మనిషి… ఆరోజు మహాత్మా గాంధీతో పోల్చి చూడదగిన గొప్ప నాయకుడు. బడుగు బలహీనవర్గాల కోసం దళిత గిరిజన వర్గాల కోసం ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా… అవన్నీ కూడా అంబేద్కర్ ఆలోచన నుంచి వచ్చినవే అని కేటీఆర్ స్పష్టం చేశారు.

కొలంబియా యూనివర్సిటీలో ఆయనకు ఇచ్చిన ఘనమైన నివాళి మనమందరం గుర్తు తెచ్చుకోవాలి. అంబేద్కర్ ఆధునిక భారతదేశ జాతిపిత అనేటువంటి మాట చెప్పింది  సమాజంలో సమానత్వం రావాలి అంటే రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగించాల్సిన అవసరం ఉన్నది అని అన్నారు.

రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు అంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలంతా కలిసి అంబేద్కర్ ఆలోచనల కోసం ఆయన ఆశల కోసం కలిసి పని చేయాల్సిన అవసరం ఉన్నది.. ఆ దిశగా అందరం కలిసి ముందుకు సాగుదామని విజ్ఞప్తి చేస్తున్నాను అని పేర్కొన్నారు.