mt_logo

పల్లె ప్రకృతి వనం భేష్!!-కేటీఆర్

తెలంగాణ పల్లెల ప్రకృతి వనాలపై ఐటీ, మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ప్రకృతి వనాలు పల్లెలకు కొత్త అందాలను అద్దుతున్నాయని మంత్రి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో పంచాయితీ రాజ్ చట్టం తెచ్చిన మార్పులతో ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కృతం అవుతున్నదని పంచాయితీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఆయా పంచాయితీల ఆధ్వర్యంలో ఎకరం స్థలంలో ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని, ప్రకృతి వనాలతో ఆహ్లాద వాతావరణం ఏర్పడుతున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *