![](https://i0.wp.com/missiontelangana.com/wp-content/uploads/2024/05/inshot_20240531_1202383491880873296482993034.jpg?resize=1024%2C575&ssl=1)
ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల? అమరుల స్థూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరి వల్ల అని ప్రశ్నించారు.
1952 లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్ధులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి 6 మందిని బలిగొన్నది ఎవరు? 1969-71 తొలిదశ ఉద్యమంలో 370 తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపింది ఎవరు? అని అడిగారు.
1971 పార్లమెంట్ ఎన్నికల్లో 11/14 సీట్లలో తెలంగాణ ప్రజాసమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది ఎవరు? దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజాస్వామికంగా, తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే, తెలంగాణను తుంగలో తొక్కింది ఎవరు? అని ధ్వజమెత్తారు.
2004లో మాట ఇచ్చి, పదేళ్లు తాత్సారం చేసి వందలాది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి కారణం ఎవరు ? రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టు, వేలాది తెలంగాణ బిడ్డలను చంపినా బలి దేవత ఎవరు అని కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. వీటన్నిటికీ కారణం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని నిలదీశారు.