mt_logo

ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర కొద్ది సేపటి క్రితం మొదలైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలు చేసి తరలింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్షం కారణంగా ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం కాస్త ఆలస్యం అవనుందని మంత్రి తెలిపారు. ట్యాంక్ బండ్ పై క్రేన్ నంబర్ 4 వద్ద ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం కోసం భారీ క్రేన్ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది అతిపెద్ద ఖైరతాబాద్ వినాయకుడిని లక్షలాదిమంది భక్తులు దర్శించుకున్నారు. కాగా హైదరాబాద్ లో నిర్వహించే గణేష్ ఉత్సవాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతిసారి లాగే ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా నిర్వహణ చేపట్టారు. గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. గణేష్ శోభాయాత్ర సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గణేష్ శోభాయాత్ర మార్గంలో సిసి కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిమజ్జనాన్ని పర్యవేక్షించనున్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం అవసరమైన చోట అదనపు క్రేన్లు ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *