mt_logo

నాలుగు రహదారులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి : సీఎం కెసిఆర్

హైదరాబాద్ చుట్టూ నిర్మిస్తున్న నాలుగు మార్గాల ఎక్స్‌ప్రెస్ వే ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్ర రహదారుల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఉత్తరంవైపు సంగారెడ్డి-గజ్వేల్-చౌటుప్పల్ ఎలైన్మెంట్ లో యాదాద్రి కూడా చేర్చాలని, దక్షిణ మార్గంలో మరొక 182కిమీ మార్గానికి తక్షణమే అనుమతులు ఇవ్వాలని, హైదరాబాద్-విజయవాడ మధ్య ఉన్న 65వ జాతీయ రహదారిని ఆరువరుసల రహదారిగా విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3,306కిమీల జాతీయ రహదారులను అభివృద్ధి చేయడానికి ఆమోదముద్ర వేయగా దానిలో 2,168కిమీ రహదారులను మాత్రమే జాతీయ రహదారులుగా నోటిఫై చేసి అభివృద్ధి చేసారని,మిగిలిన 1,138కిమీల రాష్ట్ర రహదారులను కూడా వెంటనే జాతీయ రహదారులుగా నోటిఫై చేయాలని విన్నవించారు. కేంద్ర రహదారి మౌలిక వసతి కింద కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ. 744 కోట్లు కేటాయించాలని కోరగా, కేవలం రూ. 250 కోట్లు మాత్రమే కేటాయించారని సీఎం కెసిఆర్ అన్నారు. తెలంగాణాలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేలా నిధులు కేటాయించాలని ఈ సంధర్బంగా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *