mt_logo

ఇండియాలో అతిపెద్ద ఐస్‌క్రీం తయారీ యూనిట్‌ తెలంగాణలో : మంత్రి కేటీఆర్

ఇండియాలోనే అతిపెద్ద ఐస్‌క్రీం తయారీ యూనిట్‌కు తెలంగాణ నెలవయింది. సంగారెడ్డి జిల్లాలోని జహీరబాద్‌లో అరుణ్ ఐస్‌క్రీమ్స్, ఇబాకోగా ప్రసిద్ధి చెందిన హాట్సన్ ఐస్‌క్రీం కంపెనీ తయారీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ యూనిట్ ద్వారా రోజుకు ఏడు టన్నుల చాక్లెట్ ప్రాసెసింగ్ ప్లాంట్, రోజుకు 100 టన్నుల ఐస్ క్రీమ్ తయారీ ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం దేశంలో ఇంత పెద్ద మొత్తంలో  ఐస్‌క్రీం తయారీ యూనిట్ మరొకటి లేదు. 

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు గురువారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రూ.400 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో హాట్సన్ మొత్తం రూ.600 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. తెలంగాణలో జరుగుతున్న ‘శ్వేత విప్లవం’కు ఇదే నిదర్శనమని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఈ యూనిట్ ద్వారా రోజుకు 10 లక్షల లీటర్ల పాలను సేకరించి 5,000 మంది స్థానిక పాడి రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. దీని ద్వారా 1500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ‘హాట్సన్ ద్వారా రోజుకు 7 టన్నుల చాక్లెట్ ప్రాసెసింగ్ ప్లాంట్, రోజుకు 100 టన్నుల ఐస్‌క్రీమ్ తయారీ ప్లాంట్‌ ప్రారంభమవుతోంది. తెలంగాణలో అరుణ్ ఐస్ క్రీమ్‌లు అండ్ ఇబాకో… దేశంలో అతి పెద్ద ఐస్‌క్రీం తయారీ యూనిట్‌కు నిలయంగా ఉండడం సంతోషంగా ఉందని కేటీఆర్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *