దేశంలో కొవిడ్ పరిస్థితులు సద్దుమణగడంతో ప్రైవేట్ రంగంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ పుంజుకొంటున్నది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో నియామకాలు 6% పెరిగినట్టు మాన్స్టర్ ఇండియా ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ (ఎంఈఐ) స్పష్టం చేసింది. ఐటీ, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాలకు సంబంధించిన ఉద్యోగ నియామకాల్లో హైదరాబాద్ 39% వృద్ధిరేటుతో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకొన్నది. హైదరాబాద్తోపాటు ఢిల్లీ ఎన్సీఆర్ కూడా 39% వృద్ధిని నమోదు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నై (35 శాతం), బెంగళూరు (31 శాతం), ముంబై (29 శాతం) ఉన్నాయి. దేశంలోని 11 మహా నగరాల్లో రెండంకెల వృద్ధి నమోదయిందని, మిగిలిన 2 మెట్రో నగరాల్లో మాత్రం నియామకాలు గతంలో కంటే తగ్గాయని విడుదల చేసిన వార్షిక నివేదికలో ప్రకటించింది. అన్ని రంగాల్లో కలుపుకొని 16% వృద్ధిరేటుతో హైదరాబాద్ దేశంలోనే తృతీయ స్థానంలో నిలిచినట్టు వెల్లడించింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, ఐటీ రంగాల్లో నియామకాలు క్రమంగా పెరుగుతున్నట్టు పేర్కొన్నది. ఇంజినీరింగ్, సిమెంట్, నిర్మాణ, ఇనుము/ఉక్కు తదితర రంగాల్లో ఉద్యోగ నియామకాలు దాదాపు 20% తగ్గినట్టు తెలిపింది. ప్రస్తుతం పలు కంపెనీలు ‘వర్క్ ఫ్రం హోం’ విధానానికి స్వస్తి పలికి ‘వర్క్ ఫ్రం ఆఫీస్’ విధానాన్ని ప్రారంభిస్తుండటంతో మున్ముందు ఉద్యోగ నియామకాలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని అంచనా వేసింది.
- Silence seems deafening as the blaring mikes go mute
- KTR leaves his mark through innovative campaigning in Telangana elections
- People have every reason to vote for the BRS party: KTR
- Why minorities should vote for Congress, asks Minister Mahmood Ali
- Leaders from across country arrive in Telangana to take on CM KCR
- సైలెంట్ ఓటింగ్ చాలా పవర్ ఫుల్గా ఉంటుంది… మేమే గెలుస్తున్నాం: కేటీఆర్
- ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్న కాంగ్రెస్.. కామారెడ్డిలో కర్ణాటక ఎమ్మెల్యే
- ముంపు గ్రామ ప్రజలకు 12 కాలుష్య రహిత పరిశ్రమలు తీసుకొస్తా: సీఎం కేసీఆర్
- ప్రజల హార్షాతిరేకాల నడుమ 96 ప్రజా ఆశీర్వాద సభల ప్రస్థానం
- వరంగల్లో రైల్వే లైన్లపై 6 బ్రిడ్జీలు నిర్మిస్తాం: సీఎం కేసీఆర్
- ఎన్నికల్లో అన్నీ తానై పార్టీని నడిపించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
- గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేకంగా బోర్డు: కేటీఆర్
- ప్రభుత్వం ఏర్పాటు చేశాక నెల రోజుల్లో ఆర్టీసీ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తాం: సీఎం కేసీఆర్
- 111 జీవో పూర్తిస్థాయిలో ఎత్తివేత: సీఎం కేసీఆర్
- ఇందిరమ్మ రాజ్యంలో ‘దళిత బంధు’ లాంటి పథకం పెడితే ఇవ్వాల దళితుల్లో ఇంత దుస్థితి ఉండేది కాదు: సీఎం కేసీఆర్