దేశంలో కొవిడ్ పరిస్థితులు సద్దుమణగడంతో ప్రైవేట్ రంగంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ పుంజుకొంటున్నది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో నియామకాలు 6% పెరిగినట్టు మాన్స్టర్ ఇండియా ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ (ఎంఈఐ) స్పష్టం చేసింది. ఐటీ, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాలకు సంబంధించిన ఉద్యోగ నియామకాల్లో హైదరాబాద్ 39% వృద్ధిరేటుతో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకొన్నది. హైదరాబాద్తోపాటు ఢిల్లీ ఎన్సీఆర్ కూడా 39% వృద్ధిని నమోదు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నై (35 శాతం), బెంగళూరు (31 శాతం), ముంబై (29 శాతం) ఉన్నాయి. దేశంలోని 11 మహా నగరాల్లో రెండంకెల వృద్ధి నమోదయిందని, మిగిలిన 2 మెట్రో నగరాల్లో మాత్రం నియామకాలు గతంలో కంటే తగ్గాయని విడుదల చేసిన వార్షిక నివేదికలో ప్రకటించింది. అన్ని రంగాల్లో కలుపుకొని 16% వృద్ధిరేటుతో హైదరాబాద్ దేశంలోనే తృతీయ స్థానంలో నిలిచినట్టు వెల్లడించింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, ఐటీ రంగాల్లో నియామకాలు క్రమంగా పెరుగుతున్నట్టు పేర్కొన్నది. ఇంజినీరింగ్, సిమెంట్, నిర్మాణ, ఇనుము/ఉక్కు తదితర రంగాల్లో ఉద్యోగ నియామకాలు దాదాపు 20% తగ్గినట్టు తెలిపింది. ప్రస్తుతం పలు కంపెనీలు ‘వర్క్ ఫ్రం హోం’ విధానానికి స్వస్తి పలికి ‘వర్క్ ఫ్రం ఆఫీస్’ విధానాన్ని ప్రారంభిస్తుండటంతో మున్ముందు ఉద్యోగ నియామకాలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని అంచనా వేసింది.
- Series of food poisoning incidents in Telangana residential institutions a big concern
- Principals’ negligence and funds misappropriation plaguing Gurukuls in Telangana
- Elephant fear grips north Telangana; 60-70 elephants might enter from Maharashtra
- People fed up with Congress misrule, says KCR
- KCR advises BRS leaders to focus on social media
- కంప్యూటర్ టీచర్లకు మూడు నెలలుగా జీతాలు లేవు: కాంగ్రెస్ సర్కార్పై హరీష్ రావు ఫైర్
- నిర్మల్ జిల్లా కేజీబీవీ పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటనపై స్పందించిన హరీష్ రావు
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గళం.. నాగర్కర్నూల్కు బలం: కేటీఆర్
- పాలమూరుకు పట్టిన దరిద్రమే కాంగ్రెస్ పార్టీ: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
- కాంగ్రెస్ నాయకుల మధ్య అబద్ధాల పోటీ జరుగుతుంది: హరీష్ రావు
- కేసీఆర్ బస్సు యాత్ర కోసం ఈసీని అనుమతి కోరిన బీఆర్ఎస్
- కపటనీతికి మారుపేరు కాంగ్రెస్.. యువతకు కాంగ్రెస్ చేసిన ద్రోహంపై కేటీఆర్ ధ్వజం
- అహంకారంతో కళ్లు నెత్తికెక్కిన కాంగ్రెస్ నేలకు దిగిరావాలంటే వినోదన్న గెలవాలి: హరీష్ రావు
- 2001 లోనే హైదరాబాద్లో గులాబీ జెండా ఎగురవేసిన నాయకుడు పద్మారావు గౌడ్: కేటీఆర్
- కాంగ్రెస్కి రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం: కేటీఆర్