mt_logo

సీఎం కేసీఆర్ ను కలిసిన హిటాచీ ప్రతినిధులు..

హిటాచీ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు సమావేశమై రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ లో పరిశ్రమల స్థాపనకు వసతులు కల్పించామని, త్వరలో నూతన పారిశ్రామిక విధానాన్ని అమలులోకి తేనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వివిధ రంగాల్లో స్మార్ట్ కార్డు విధానం ప్రవేశపెట్టాలని సంస్థ ప్రతినిధులను సీఎం కోరగా వారు స్పందిస్తూ హైదరాబాద్ ను స్మార్ట్ సిటీగా మార్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని, సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సీఎంతో సమావేశానికి ముందు పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును హిటాచి కంపెనీ ప్రతినిధులు కలిసి రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *