mt_logo

తెలంగాణ ముంగిట్లో హరితహారం సందడి..

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం శుక్రవారం ప్రారంభమయ్యింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇచ్చిన పిలుపుకు స్పందించిన రాష్ట్ర ప్రజలు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వచ్చిన తెలంగాణను ఆకుపచ్చగా మార్చే క్రమంలో మొక్కలు నాటేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుండి వార్డ్ మెంబర్ల దాకా అందరూ హరితహారంలో భాగాస్వామ్యులయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడికక్కడే పనిచేస్తున్న కార్యాలయాల్లో మొక్కలు నాటారు. తెలంగాణ సారధి కళా బృందాలు అడవుల పరిరక్షణను వివరిస్తూ అడవుల ఆవశ్యకతపై పాటలు పాడారు. నీరు ఉంటే చెట్లు పెరుగుతాయి.. చెట్లు ఉంటే వర్షాలు వస్తాయి.. నీటికి, చెట్లకు అవినాభావ సంబంధమని, మూడేళ్ళలో ఎక్కడ చూసినా పచ్చగా కనిపించాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *