mt_logo

ఆదానీకి ఏజెంట్‌గా రేవంత్ కొమ్ముకాస్తున్నాడు: హరీష్ రావు

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. రేవంత్ రెడ్డి రోడ్ల మీద చేస్తున్న సర్కస్ ఫీట్లు చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. ఆదానీతో దోస్తీ గల్లీలో కుస్తీ పడుతున్నడు.. మొదటి రోజు శాసనసభకు ఆదానీ, రేవంత్ అక్రమ సంబంధం మీద నిరసనగా టీషర్ట్స్ వేసుకొని వస్తే అడ్డుకున్నారు. ఇద్దరి దోస్తీకి కట్టుబడి సభ ప్రాంగణంలోకి కూడా అడుగుపెట్టనివ్వలేదు అని విమర్శించారు.

ఈరోజు రాజ్ భవన్ వద్ద ఆదానీ అవినీతి గురించి మాట్లాడినట్లు సర్కస్ చేసిండు. అక్కడికి వెళ్లి కూడా కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ గురించే మాట్లాడిండు తప్ప, ఆదానీ అవినీతి గురించి మాట్లాడింది తక్కువ  మీ పోరాటం ఆదాని మీద అయితే మొదటి రోజు మమ్మల్ని ఎందుకు అసెంబ్లీ రాకుండా అడ్డుకున్నావు, నిరసన తెలిపే అవకాశం కూడా ఎందుకు ఇవ్వలేదు అని అడిగారు.

మేము అడుతున్నా ఎందుకు అసెంబ్లీలో చర్చ పెట్టడం లేదు.

దావోస్ వెళ్లి ఆదానీతో రూ. 12,400 కోట్ల అగ్రిమెంట్లు చేసుకున్నవు. నీకు నిజంగా ఆదానీ అవినీతి మీద పోరాటం చేయాలనుకుంటే ముందు వెంటనే అగ్రిమెంట్లు రద్దు చెయ్యి  అదానీ గ్రీన్‌తో రూ. 5 వేల కోట్ల కాంట్రాక్టు, వంద మెగావాట్ల డాటా సెంటర్‌కు రూ. 5 వేల కోట్లకు, రూ. 1400 కోట్లతో సిమెంట్ ఫ్యాక్టరీ, అదానీ డిఫెన్స్ కోసం వెయ్యి కోట్లతో అగ్రిమెంట్ చేసుకున్నావు  మొత్తంగా రూ. 12,400 కోట్ల అగ్రిమెంట్ చేశారు. నీ మాటల్లో నిజాయితీ ఉంటే, వంద కోట్లు వాపస్ ఇచ్చినట్లు రూ. 12,400 కోట్లు రద్దు చేసుకోవాలి అని సవాల్ విసిరారు.

అగ్రిమెంట్లు రద్దు చేసి నీ చిత్తుశుద్ధిని నిరూపించుకో రేవంత్ రెడ్డి  నేతి బీరకాయలో నీతి ఎంతనో, నీ పోరాటంలో నిజాయితీ అంత.. రామన్నపేటలో డ్రైపోర్టు కోసం ల్యాండ్ ఇస్తే సిమెంట్ ఫ్యాక్టీరికి అనుమతి ఇచ్చావు  ఆదానీ కోసం పోలీసులను పెట్టి అరెస్టులు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టావు  పోలీసు పహారా మధ్య పబ్లిక్ హియరింగ్ చేసావు. ఆదానీకి ఏజెంట్‌గా కొమ్ముకాస్తున్నావు అని హరీష్ రావు దుయ్యబట్టారు.

ప్రజల కోరిక మేరకు సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. డైవర్షన్ పాలిటిక్స్, సర్కస్ ఫీట్లు తప్ప ఇంకే లేదు. మీ డబుల్ స్టాండర్డ్‌కు నిదర్శనం మీ చిత్తశుద్ధి లేని పోరాటం. ఆదానీ దేశ పరువు తీసిండు అని రేవంత్ రాజ్ భవన్ వద్ద అన్నడు. మరి నువ్వు దావోస్ వెళ్లి ఒప్పందాలు చేసుకొని తెలంగాణ పరువు తీసావు. ఆదానీకి రెడ్ కార్పెట్ వేసావు రాష్ట్ర పరువు తీసావు. ఢిల్లీలో పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ పరువును తీసావు. ఆదానీ, రేవంత్ అక్రమ సంబంధం మీద రేపు అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.

రేవంత్ రెడ్డికి ఆ ధైర్యమే లేదు.. అంతర్గతంగా ఒప్పందం ఉంది. సీఎం రాజ్ భవన్ వద్ద ట్రాఫిక్ జాం చేసిండు. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ధర్నాలో పాల్గొన్న అందరి మీద కేసులు పెట్టాలి  ధైర్యం ఉంటే, చట్టం అందరికి సమానం అయితే వారి మీద కేసులు పెట్టండి అని సవాల్ విసిరారు.