హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్తో కలిసి ప్రభుత్వం లక్షల మంది ఆకలి తీర్చడం జరుగుతున్నదని, పేదల ఆకలి తీర్చడంలో సహాయపడుతున్నందుకు సంతోషంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. నార్సింగిలో హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన సెంట్రలైజెడ్ కిచెన్ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. హైదరాబాద్లోని 18 ప్రభుత్వ దవాఖానలకు అన్ని జిల్లాల నుంచి చికిత్స కోసం పెద్ద సంఖ్యలో రోగులు, వారి వెంట వచ్చే సహాయకులు కొన్నిసార్లు రోజుల తరబడి ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుందని… ఈ పరిస్థితులను అర్థం చేసుకొని రోగులకు, వారి సహాయకులకు హరేకృష్ణ ట్రస్ట్ మరియు ప్రభత్వం తరపున రూ.5 కే భోజనం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా చారిత్రక ఉస్మానియా ఆసుపత్రి వేదికగా గత నెలలో ప్రారంభించామని, ఈ ఆసుపత్రుల్లో భోజనం అందించేందుకు హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెంట్రలైజెడ్ కిచెన్ ను నేడు ఇక్కడ ప్రారంభించామని పేర్కొన్నారు.

