ప్రపంచ నీటి దినోత్సవాలను పురస్కరించుకొని జల మండలి, గాంధీజ్ఞాన్ ప్రతిష్టన్ సంయుక్త ఆధ్వర్యంలో భూగర్భ జలాల పరిరక్షణ అవగాహన కార్యక్రమం వ్యవసాయ శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగింది. అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలు సాగు నీటికై, త్రాగు నీటి కొరకై ఎలాంటి ఇక్కట్లకు లోను కాకుండా ఉండేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. మూడేళ్లలో ప్రపంచంలో ఎత్తయిన కాళేశ్వరం నిర్మించారు. పాలమూరు రంగారెడ్డి 70 శాతం పూర్తయింది. ఏడేళ్లలో తెలంగాణ కోటి ఎకరాలకు సాగు నీటిని అందిస్తూ దేశంలోనే వ్యవసాయ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపి తెలంగాణ కీర్తిని ఇనుమడింపజేశారు. సీఎం కేసీఆర్ రైతన్నలకై ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. హైద్రాబాద్ నగర ప్రజల దాహర్తిని తీర్చడానికి ఎన్నో వందల కిలోమీటర్ల నుండి వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసి మంచి నీటిని నగరానికి తీసుకొచ్చి ఉచితంగ సరఫరా చేస్తున్నారు. రోజు రోజుకూ అడుగంటుతున్న భూగర్భ జలాలను పరిరక్షించుకొని నీటి నిల్వలను పెంపొందించుకోవాల్సిన బాధ్యత నగర ప్రజల అందరి పై ఉన్నదని ప్రతి ఒక్కరూ తమ ఇంటి అవరణంలో విధిగా ఇంకుడు గుంతల ను ఏర్పాటు చేసుకొని రాబోయే వర్షాకాలంలో ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంపొందించుకొని రాబోయే తరాలకు నీటి నిల్వలను అందించాలని అన్నారు. ఈ సంధర్భంగా ప్లకార్డులు, కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జలమండలి డి.జీ.యం శ్రీనివాస్ రావు, జీ.యం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

