mt_logo

సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు 75 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

2022 ఫిబ్రవరిలో జరగనున్న మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర కోసం రూ.75కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మహాజాతరలో రోడ్లు, విద్యుత్, తాగునీటి సరఫరా, స్నానాల గదుల ఏర్పాటు తదితర మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. రెండేళ్లకోసారి నిర్వహించే జాతర సందర్భంగా ఇటీవల రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆధ్వర్యంలో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.110 కోట్లు అవసరం ఉంటాయని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటిని పరిశీలించిన ప్రభుత్వం రూ.75కోట్లు విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *