mt_logo

ఓరుగల్లుకు ఐటీ దిగ్గజం జెన్ ఫ్యాక్ట్.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్

ప్రముఖ ఐటీ దిగ్గజం జెన్ ప్యాక్ట్ తమ కార్యాలయాన్ని వరంగల్ నగరంలో ప్రారంభించనున్నట్టు తెలిపింది. గురువారం ఉదయం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారితో జరిగిన సమావేశంలో తమ నిర్ణయాన్ని ప్రకటించారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్.. తెలంగాణలో సమ్మిళిత అభివృద్ధి జరగాలని, అందుకు రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటి కంపెనీలను తీసుకువెళ్లాలి అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు ఐటి శాఖ ఆచరణ తోడు అవడంతో పెద్ద కంపెనీలు కూడా ద్వితీయ శ్రేణి నగరాలకు వస్తున్నాయన్నారు. ఇప్పటికే టెక్ మహీంద్రా, సయింట్ వంటి ఐటీ దిగ్గజాలు వరంగల్ నగరంలో తమ కార్యకలాపాలు ప్రారంభించగా.. తాజాగా జెన్ ప్యాక్ట్ రావడం వరంగల్ వాసులకు గొప్ప వార్త అని ఆనందం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *