mt_logo

ఓటుకు నోటు కేసులో ఎలక్షన్ కమిషన్ సీరియస్!

ఓటుకు నోటు కేసును ఈసీ సీరియస్ గా తీసుకుంది. రూ. 5 కోట్లకు ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంపై ఎలక్షన్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అవినీతి నిరోధక శాఖకు ఈసీ నుండి ఒక లేఖ వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఓటుకు నోటు కేసులో దర్యాప్తు కొనసాగించాలని, ఈ కేసుపై పూర్తి విచారణ జరపాలని లేఖలో సారాంశం. కేసులో లాజికల్ ఎండ్ కనుక్కోవాలని, సమగ్ర విచారణ జరిపి నివేదికను అందించాలని ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ను ఈసీ ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *