mt_logo

హైదరాబాదీలకు అతి పొడవైన ఫ్లైఓవర్ అంకితం : మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ నగరంలో మరో అతి పొడవైన ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తయింది. ఓవైసీ, మిథాని కూడలిలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఫ్లై ఓవర్ నిర్మించిన ఈ ఫ్లైఓవర్​ను పురపాలక శాఖమంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా 80 కోట్ల వ్యయంతో 1.365 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ మంగళవారం నుండి అందుబాటులోకి రానుందని మంత్రి కేటీఆర్‌ తన ట్విట్టర్లో వెల్లడించారు. ఈ ఫ్లైఓవర్‌ను హైదరాబాద్‌ ప్రజలకు అంకితం ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని ట్వీట్ చేసిన కేటీఆర్, శరవేగంగా పనులు పూర్తిచేసిన ఎస్​డీపీ బృందాన్ని ఈ సందర్భంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *