
తెలంగాణను ఎడారిగా మార్చే కాంగ్రెస్ కుట్రలు ఎండగట్టడానికే ఛలో మేడిగడ్డ పర్యటన నిర్వహిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
ఛలో మేడిగడ్డ నిర్వహించడానికి గల కారణాలను వివరించాడు 👇
– చిన్న లోపాన్ని.. పెద్ద భూతద్దంలో చూపిస్తూ.. బాధ్యత మరిచిన కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసేందుకు
– ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టును పరిరక్షించకుండా.. కూలిపోవాలని చూస్తున్న కాంగ్రెస్ కుతంత్రాన్ని ప్రజల సాక్షిగా నిలదీయడానికి
– పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పండుగలా మారిన వ్యవసాయాన్ని మళ్లీ దండగలా మార్చే కాంగ్రెస్ పన్నాగాలకు పాతరేసేందుకు
– పంజాబ్నే తలదన్నే స్థాయికి ఎదిగిన తెలంగాణ రైతుకు వెన్నుపోటు పొడుస్తున్న కాంగ్రెస్ నీచ సంస్కృతికి సమాధి కట్టేందుకు
– మరమ్మత్తులు కూడా చేతకాని గుంపుమేస్త్రీని నమ్ముకుంటే తెలంగాణ రైతు నిండా మునుగుడే.. అని మరోసారి చాటిచెప్పేందుకు
– దశాబ్దాలపాటు.. కాంగ్రెస్ చేసిన తప్పులను.. కాంగ్రెస్ పాలనలో సాగునీటి తిప్పలను.. అరవై ఏళ్లు కాంగ్రెస్ పెట్టిన అరిగోసను అన్నదాతలు మరువలేదని గుర్తుచేసేందుకు
మళ్లీ కన్నీటి సాగుకు తెలంగాణను కేరాఫ్ గా మారిస్తే సహించం.. మీ దుష్ట రాజకీయాల కోసం.. మా తెలంగాణ రైతాంగాన్ని బలిచేస్తే భరించం అని కాంగ్రెస్ పార్టీని కేటీఆర్ హెచ్చరించారు.
పోటీ యాత్రలు చేయడం కాదు.. ప్రజలు అప్పగించిన డ్యూటీ చేయండి..మేడిగడ్డకు మరణశాసనం రాయాలని చూస్తే.. తెలంగాణ గడ్డపై.. కాంగ్రెస్కే నూకలు చెల్లడం ఖాయం వచ్చే వరదల్లో.. కాంగ్రెస్ పార్టీయే కొట్టుకుపోవడం తథ్యం అని పేర్కొన్నారు.