mt_logo

కేసీఆర్ పొలం బాట పట్టాకే కాంగ్రెస్ సర్కార్ కళ్ళు తెరిచింది: హరీష్ రావు

రైతులను ఆదుకోవాలని, ధాన్యానికి బోనస్ ఇవ్వాలని, రైతు భరోసాను అమలు చేయాలి, రైతు ఋణమాఫీ చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, మరియు ప్రజాప్రతినిధుల బృందం వినతిపత్రాన్ని అందచేశారు.

ఈ సందర్భంగా మీడియాతో హరీష్ రావు మాట్లాడారు.. ప్రభుత్వ నీటి నిర్వహణ, విద్యుత్ వైఫల్యం వల్లనే పంట నష్టం.. కరువును నివారించే ప్రయత్నలు కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు అని అన్నారు.

దొంగలు పడ్డాక అరు నెళ్లకు కుక్కులు మోరిగినట్లుగా ఉంది సర్కారు తీరు.. కేఅర్ఎంబీని కేంద్రానికి అప్పగించడాన్ని కేసీఆర్ నిలదీసాకే ప్రభుత్వం కళ్లు తెరిచింది.. కేసీఆర్ పొలం బాట పట్టాకే సర్కారు పంటల విషయంలో కళ్ళు తెరిచింది అని పేర్కొన్నారు.

బీఅర్ఎస్ పోరాటాల వల్ల రైతులకు కొంత ఊరట కలిగింది.. వడగళ్ళు, ఎండిన పంటలకు ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం ఇవ్వాలి.. వంద రోజుల్లో చేస్తానన్న హామీలు వెంటనే అమలు చేయాలి అని హరీష్ డిమాండ్ చేశారు.

ఎలక్షన్ కోడ్ ఉందని ఉత్తమ్ చావు కబురు చల్లగా చెప్పారు.. రైతులను దగా చేసింది కాంగ్రెస్.. వంద రోజుల తరువాతే కోడ్ వచ్చింది.. పంటలకు ఇస్తామన్న బోనస్ యసంగి పంటలకు ఇచ్చి కొనుగోలు చేయాలి అని అన్నారు.

ఎకరాకు రూ. 15 వేలు రైతులకు, కౌలు రైతులకు వెంటనే ఇవ్వాలి.. అడుగడుగునా రైతులకు కాంగ్రెస్ అన్యాయం చేసింది.. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ కట్టుబడి ఉండాలి అని తెలిపారు.

బీఅర్ఎస్ అధికారంలో ఉన్నా లేకున్నా తమదెప్పుడు రైతు పక్షమే.. రైతుల పక్షాన కేసీఆర్ మాట్లాడితే కాంగ్రెస్ నేతలు ముప్పేట దాడికి దిగుతున్నారు అని పేర్కొన్నారు.

ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని.. కూడవెల్లి వాగులోకి తక్షణమే నీళ్ళు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ హయాంలో ఒక్క ఎకరా ఎండలే.. కాంగ్రెస్ వచ్చాకే పంటలు ఎందుతున్నాయి.. నీళ్ళు ఉందగా ఇవ్వకుండా పంటలు ఎండగడుతున్నారు..  24 గంటల్లో కూడవెల్లికి నీళ్ళు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.. మల్లన్నసాగర్‌ను ముట్టడిస్తాం అని హరీష్ రావు హెచ్చరించారు.

భట్టి ఒట్టి మాటలు కట్టిపెట్టాలి.. రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వండి.. తక్షణమే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి.. ముఖ్యమంత్రి బోగస్ మాటలు మాట్లాడుతున్నారు.. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మమ్మల్ని విమర్శించే హక్కు లేదు అని అన్నారు.

దొడ్డిదారిన అధికారంలోకు వచ్చిన కాంగ్రెస్ హామీల అమలును విస్మరించింది.. కాంగ్రెస్ హామీల విషయంలో ఎలాంటి చర్చకైనా నేను సిద్ధం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓవరు వచ్చిన సరే అని సవాల్ విసిరారు.

పంటలు ఎండుతుంటే వికృత అనండం పొందుతున్నది కాంగ్రెస్.. కాంగ్రెస్ వచ్చాక నీళ్ళు తగ్గి రైతుల్లో కన్నీళ్లు పెరిగినయి.. దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని పేర్కొన్నారు.

రైతుల ఆత్మహత్యలపై కూడా జోకులు వేస్తున్నారు.. విపక్ష నాయకుల ఇళ్లలోకి వెళ్లి పార్టీలో చేర్చుకునే శ్రద్ద రైతులకు నీళ్ళు ఇవ్వడంలో లేదు.. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలు మాని రైతులను ఆడుకోవాలి అని కోరారు.

రైతులకు మేలు చేస్తే మేము అడ్డుకోము.. కాంగ్రెస్ లాగా ఎలక్షన్ కమీషన్‌కు ఫిర్యాదు చేయం అని హరీష్ స్పష్టం చేశారు.