mt_logo

సీఎం చెప్పేవన్నీ అబద్ధాలే – కేటీఆర్

టిఎన్‌జీవో సంఘం హైదరాబాద్ శాఖ 2014 డైరీ ఆవిష్కరణ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగింది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొన్నారు, శాసనసభలో సీఎం తెలంగాణపై చెప్పినవన్నీ అబద్ధాలేనని, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడని, కొత్తగా ఏమీ చెప్పట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో 13లక్షల బోర్లు ఉంటే తెలంగాణలో 15లక్షల బోర్లు ఉన్నాయని, నీళ్ళు లేక రైతులు బోర్లపై ఆధారపడాల్సి వస్తుందని చెప్పారు. ప్రభుత్వం సాగునీరు అందించకపోతే రైతుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *