mt_logo

సీఎం కిరణ్ అరిగిపోయిన గ్రామ్ ఫోన్: కేటీఆర్

తెలంగాణ బిల్లుపై ఓటింగ్ ఉంటుందని, మెజార్టీ సభ్యులు ఓడిస్తారని చెప్పడం సీఎం మూర్ఖత్వానికి పరాకాష్ఠ అని టీఆరెస్ ఎమ్మెల్యే కేటీఆర్ దుయ్యబట్టారు. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా కిరణ్ మాట్లాడుతూనే ఉంటారని, ఏమి చేసినా తెలంగాణ ఆపే ధైర్యం అతడికి లేదని అన్నారు. బిల్లు అసెంబ్లీకి రావడం ఆనవాయితీ మాత్రమే అని, రాజ్యాంగంలో ఈ విషయం స్పష్టంగా ఉందని వివరించారు. రాష్ట్రపతి పంపిన బిల్లు అభిప్రాయాల కోసమేనని, గడువు తర్వాత తిరిగి పార్లమెంటులో ప్రవేశబెట్టబడుతుందని స్పష్టం చేశారు. విభజన నిర్ణయంలో పార్లమెంటుదే తుదినిర్ణయమని, ఈ విషయం పంజాబ్, బీహార్ రాష్టాల ఏర్పాటులో స్పష్టమయ్యిందన్నారు. రాష్ట్ర విభజన విషయంలో సుప్రీంకోర్టు కు కూడా ఏవిధమైన నిర్ణయాధికారాలు లేవన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *