mt_logo

తెలంగాణకు రూపాయికూడా ఇవ్వను: సీఎం

హైదరాబాద్: సీమాంధ్ర సర్కార్ తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి అవమాన పరిచింది. తెలంగాణకు ఒక్కరూపాయి కూడా ఇవ్వనని, ఏం చేసుకుంటారో చేసుకోండి, రాసుకోండని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహంతో తెలంగాణను అవమానించే విధంగా అన్నారు. శాసనసభలో టీఆర్‌ఎస్ అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఆయన ఆపార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావుపై ఆగ్రహంతో మాట్లాడారు. ‘తెలంగాణ ప్రాంతానికి ఒక్కరూపాయి కూడా ఇవ్వను, ఏంచేస్తారో చేసుకోండి, రాసుకోండి’ అని అన్నారు. తెలంగాణ కోసం మాట్లాడుతున్న హరీష్‌రావును వీధి రౌడితో సీఎం పోల్చి తప్పు చేశారు. తెలంగాణ భాషను మరోసారి అపహాస్యం చేశారు.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *