ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం జోగులాంబ గద్వాలలో ఇటీవల మరణించిన ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం హైదరాబాద్కు తిరిగివెళ్తూ మార్గమధ్యంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్, కొత్తకోట మండలం విలియంకొండ తండా పరిధిలో రైతులు సాగుచేసిన మినుము, వేరుశనగ పంటలను పరిశీలించారు. మొదట రంగాపూర్ వద్ద ఆగి, మహేశ్వర్రెడ్డి అనే రైతు సాగుచేస్తున్న మినుము పంటను, రాములు అనే మరో రైతు సాగుచేస్తున్న వేరుశనగ పంటను పరిశీలించారు. రైతులతో కాసేపు ముచ్చటించారు. మినుములు, వేరుశనగ దిగుబడి ఎంత వస్తున్నది? మారెట్లో ధర ఎంత ఉన్నది? పంట చేతికొచ్చేవరకు ఎన్ని తడులు నీళ్లు పెడుతున్నరు? అని అడిగి తెలుసుకొన్నారు. ఆ తర్వాత కొత్తకోట మండలం విలియంకొండ తండా వద్ద కల్లంలో ఆరబోసిన వరి ధాన్యాన్ని సీఎం పరిశీలించారు. గోకరి వెంకటయ్య అనే రైతు వేసిన వేరుశనగ చేలోకి వెళ్లి పంటను పరిశీలించారు. వేరుశనగ దుబ్బును తెంపి కాయలను చిట్లించి చూశారు. నీళ్లు, కరెంటు పుషలంగా ఉండటంతో దిగుబడి పెరిగిందని రైతు వెంకటయ్య సీఎంకు వివరించారు. సీఎం కేసీఆర్ అకస్మాత్తుగా తమ పంట చేలల్లోకి రావడంతో రైతులు, గిరిజనులు ఆయనతో ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా మారెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని సీఎం ఆదేశించారు. సీఎం వెంట మం త్రులు శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న తదితరులు ఉన్నారు.
- Silence seems deafening as the blaring mikes go mute
- KTR leaves his mark through innovative campaigning in Telangana elections
- People have every reason to vote for the BRS party: KTR
- Why minorities should vote for Congress, asks Minister Mahmood Ali
- Leaders from across country arrive in Telangana to take on CM KCR
- సైలెంట్ ఓటింగ్ చాలా పవర్ ఫుల్గా ఉంటుంది… మేమే గెలుస్తున్నాం: కేటీఆర్
- ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్న కాంగ్రెస్.. కామారెడ్డిలో కర్ణాటక ఎమ్మెల్యే
- ముంపు గ్రామ ప్రజలకు 12 కాలుష్య రహిత పరిశ్రమలు తీసుకొస్తా: సీఎం కేసీఆర్
- ప్రజల హార్షాతిరేకాల నడుమ 96 ప్రజా ఆశీర్వాద సభల ప్రస్థానం
- వరంగల్లో రైల్వే లైన్లపై 6 బ్రిడ్జీలు నిర్మిస్తాం: సీఎం కేసీఆర్
- ఎన్నికల్లో అన్నీ తానై పార్టీని నడిపించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
- గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేకంగా బోర్డు: కేటీఆర్
- ప్రభుత్వం ఏర్పాటు చేశాక నెల రోజుల్లో ఆర్టీసీ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తాం: సీఎం కేసీఆర్
- 111 జీవో పూర్తిస్థాయిలో ఎత్తివేత: సీఎం కేసీఆర్
- ఇందిరమ్మ రాజ్యంలో ‘దళిత బంధు’ లాంటి పథకం పెడితే ఇవ్వాల దళితుల్లో ఇంత దుస్థితి ఉండేది కాదు: సీఎం కేసీఆర్