mt_logo

సెప్టెంబర్ 8నుండి 15వరకు సీఎం చైనా పర్యటన..

చైనాలో సెప్టెంబర్ 8నుండి 15వరకు జరిగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ అంతర్జాతీయ పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ఈ పర్యటన ఉంటుందని సమాచారం. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ తో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు వెళ్లనున్నారు. మైహోం చైర్మన్ రామేశ్వర్ రావు, జీఎమ్మార్ ప్రతినిధులు, రెడ్డి లాబ్స్ ప్రతినిధులు, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి, హెటిరో ల్యాబ్స్ ప్రతినిధులు, నాస్కాం చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి తదితరులు వెళ్లనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *