యాదాద్రి పుణ్యక్షేత్రం పునఃప్రారంభ ముహూర్తం ఖరారైన నేపథ్యంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం యాదాద్రిలో పర్యటించారు. ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ అభివృద్ధి పనులను, పరిసరాలను పరిశీలించి.. దాదాపు పూర్తికావస్తున్న ఆలయ పునర్నిర్మాణ పనులను, ప్రధానాలయం, గర్భగుడిని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా పరిశీలించి అధికారులకు తగు సలహాలు, సూచనలు చేశారు.
తొలుత సీఎం కేసీఆర్ టెంపుల్ సిటీ దగ్గర హెలీపాడ్ వద్దకు చేరుకోగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆలయ అధికారులు, తదితరులు సీఎంకు తులసి మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఘాట్ రోడ్డు ద్వారా నేరుగా కొండపై గల బాలాలయానికి చేరుకోగా.. వేదపండితులు, అర్చకులు ప్రత్యేక అర్చన చేసి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. తరువాత ప్రధాన దేవాలయానికి చేరుకొని, అక్కడ పెంబర్తి కళాకారులు తయారుచేసిన ద్వారాలను ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రాంగణంలోని ఆలయ ప్రాకారం వెంట ఉన్న శిల్పాల ప్రత్యేకతలను వెంట ఉన్నవారికి వివరిస్తూ.. అడుగడుగునా వ్యూ పాయింట్ల వద్ద ఆగి, అక్కడి నుంచి కనిపించే అందమైన దృశ్యాలను సీఎం తిలకించారు. గండి చెరువు, పుష్కరిణి, కల్యాణ కట్ట, దీక్షాపరుల మంటపం, సత్యనారాయణ వ్రత మంటపం తదితర నిర్మాణాల విశేషాల గురించి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డిని ‘‘మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇంతటి ఉజ్వలమైన దేవాలయం నిర్మించడం వల్ల.. సునీతమ్మా నీ జన్మ ధన్యమైంది’’ అని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ప్రధాన దేవాలయంలో గల బంగారు వర్ణంతో, శంకు-చక్ర నామాలతో ఇండోర్ లో తయారు చేయించిన క్యూలైన్లను, బంగారు తాపడాలు గల ద్వారాలను పరిశీలించారు. జలాశయాల నిర్మాణ తీరును, మంటపంలో ఏర్పాటు చేసిన నర్సింహస్వామి కల్యాణ ఘట్టాన్ని, తంజావూరు చిత్రపటాన్ని ప్రత్యేకంగా పరిశీలించి, ఆలయ మంటపం చుట్టూ తాపడం చేసి ఉన్న ప్రహ్లాద చరిత్ర ఘట్టాల విశేషాలను, మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, నాయకులతో పంచుకున్నారు. ఆల్వార్ మంటపం కలియదిరుగుతూ, ఒక్కో శిల్పాన్ని సీఎం ప్రత్యేకంగా పరికించారు. పనుల పురోగతిని ఆలయ స్తపతి, ఆనంద్ సాయి ముఖ్యమంత్రికి వివరించారు. తుది పనులపై సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. ధ్వజస్థంభం ఏర్పాటు కానున్న వేదికను, క్యూ కాంప్లెక్స్, ఎస్కలేటర్స్, శివాలయం, విష్ణు పుష్కరిణితోపాటు, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణాలను కూడా సీఎం పరిశీలించారు.
ఈ సమయంలో ఆలయ అర్చకులు తమకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరగా.. అర్చకులకు, ఆలయ ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని మంత్రి జగదీశ్ రెడ్డిని, కలెక్టర్ పమేలా సత్పతిని సీఎం ఆదేశించారు. అదేవిధంగా రింగురోడ్డు నిర్మాణ సమయంలో షాపింగ్ స్థలాలు కోల్పోయిన వారికి కల్యాణ కట్ట సమీపంలో ప్రతి ఒక్కరికీ వేయి స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఉచితంగా షాపులు నిర్మించి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం చినజీయర్ స్వామి రాసి ఇచ్చిన ముహూర్త పత్రికను స్వామివారి పాదాల చెంత ఉంచాలని.. ఆలయ ఈఓ గీతకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అందించారు. యాదాద్రిలో పది వేల మంది రుత్విక్కులతో సుదర్శన హోమం నిర్వహిస్తామని, దానిని జీయర్ స్వామి స్వయంగా పర్యవేక్షిస్తారని ఆలయ ప్రధాన అర్చకులకు తెలియజేసారు.
ఆలయ ఉద్యోగులకు పీఆర్సీ వస్తుందన్న సమాధానంతో సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం యాదాద్రిలోని రామలింగేశ్వరాలయంలో అభిషేకం, అర్చన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, వివిఐపీ గెస్ట్ హౌజ్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితర ప్రముఖులతో కలిసి భోజనం చేశారు.
- We will finish off a BRS leader: Congress MLA Laxman Kumar’s audio gone viral
- Former Tamil Nadu BJP president appointed as Telangana Governor
- Is TDP planning to contest from Khammam seat?
- A brief look at infamous stint of Tamilisai as Telangana Governor
- BRS delegation to meet Speaker requesting disqualification of Danam Nagender
- బహుజన సిద్ధాంతం మీద ఇంకా లోతుగా చర్చ జరగాలి: కేసీఆర్
- అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: హరీష్ రావు
- త్వరలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ప్రకటించిన కేసీఆర్
- గాడిదలు ఉన్నప్పుడే గుర్రాల విలువ తెలుస్తుది.. కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ సెటైర్
- Protests erupted across Telangana condemning MLC Kavitha’s arrest
- ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై స్పందించిన కేటీఆర్
- ఎమ్మెల్సీ కవిత అరెస్టును ఖండించిన బహుజన్ సమాజ్ పార్టీ
- కవిత అరెస్ట్ బీజేపీ-కాంగ్రెస్ రాజకీయ కుట్ర.. రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు: బీఆర్ఎస్
- ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు
- పార్టీ గేట్లు కాదు దమ్ముంటే ప్రాజెక్టు గేట్లు ఎత్తండి… కాంగ్రెస్ వైఫల్యాలపై విరుచుకుపడ్డ హరీష్ రావు