mt_logo

కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త తెలిపిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు శుభవార్త చెప్పారు. అసెంబ్లీలో సోమవారం ఆయన కీలక ప్రకటన చేశారు. కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులు తగ్గిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని సోమవారం అసెంబ్లీలో స్వయంగా సీఎం ప్రకటించారు. చాలా రోజుల నుంచి కటాఫ్ మార్కులు తగ్గించాలని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారన్న క్రమంలో కటాఫ్ మార్కులు తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇతర వర్గాలకు చేసిన విధంగానే ఎస్సీ, ఎస్టీలకు ఆ లెవల్‌కు తగ్గిస్తామని సీఎం పేర్కొన్నారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ కానిస్టేబుల్ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *