mt_logo

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక

హైదరాబాద్ లోని హైటెక్స్‌లో టీఆర్ఎస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశం ప్రారంభ‌మైంది. టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లీన‌రీ వేదిక‌పై ఏర్పాటు చేసిన తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పూల‌మాల వేసి, అమ‌ర‌వీరుల స్థూపానికి నివాళుల‌ర్పించారు. వేదిక‌పై ఆసీనులైన సీఎం కేసీఆర్‌కు హోంమంత్రి మ‌హ‌ముద్ అలీ ద‌ట్టీ క‌ట్టారు. టీఆ‌ర్‌‌ఎస్‌ పార్టీ అధ్య‌క్షు‌డిగా ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శే‌ఖ‌ర్‌‌రావు వరు‌సగా తొమ్మి‌దో‌సారి ఏక‌గ్రీ‌వంగా ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెస‌ర్ శ్రీనివాస్ రెడ్డి ప్లీన‌రీ వేదిక‌గా ప్ర‌క‌టించారు. అనంత‌రం సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌కు అభివాదం చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలిపారు. పార్టీ‌లోని అన్ని విభా‌గాలు, అన్ని సామా‌జి‌క‌వ‌ర్గాల నేతలు కేసీ‌ఆర్‌ పేరును ప్రతి‌పా‌దిస్తూ నామి‌నే‌షన్లు దాఖ‌లు‌చే‌శారు. అధ్యక్ష పద‌వికి ఇత‌రు‌లె‌వ్వరూ నామి‌నే‌షన్లు దాఖ‌లు చే‌య‌క‌పో‌వ‌డంతో కేసీ‌ఆర్‌ ఎన్నిక ప్రక‌టన ఏక‌గ్రీవ‌మైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *