ముస్లింల పవిత్ర పండుగ రంజాన్(ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనలు.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని, అలాగే మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందని సీఎం పేర్కొన్నారు. గంగా జమునా తెహజీబ్ కు తెలంగాణ ప్రతీక అని, లౌకిక వాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ, దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ముస్లిం మైనారిటీల అభ్యున్నతి కోసం,రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, వారి సంక్షేమానికి ప్రతి ఏటా భారీగా నిధులు కేటాయించి, ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. షాదీ ముబారక్ పథకం ద్వారా ఆడ పిల్లల పెండ్లి ఖర్చుల కోసం 1 లక్ష 116 రూపాయల సాయం అందించి, ముస్లిం పేదింటి ఆడపిల్లల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూత నందిస్తున్నదని సీఎం తెలిపారు. మైనారిటీ యువతకు ప్రత్యేక శిక్షణనిచ్చి, రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని అన్నారు. మైనారిటీ విద్యార్థులకు గురుకులాల ద్వారా అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందిస్తున్నదన్నారు. ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ ద్వారా ముస్లిం విద్యార్థుల విదేశీ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేస్తున్నదని తెలియజేసారు. ఎన్ని కష్టాలు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుందన్నారు. లౌకిక వాద విఘాత శక్తుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కటినంగా వ్యవహరిస్తుందని సీఎం పునరుద్ఘాటించారు.
- Minister KTR invited to speak on Telangana’s agriculture success at an International Dialogue in USA
- Sintex to set up a manufacturing unit in Telangana with an investment of Rs. 350 crores
- KTR to tour Wanaparthi on Sep 29 to lay foundation stones for development works
- KCR directs officials to conduct Koppula Harishwar Reddy’s last rites with official honours
- Migration of BJP leaders into BRS continues
- రూ.168 కోట్లతో హైదరాబాద్లో మూసి, ఈసా నదులపై ఫోర్ లైన్ 5 బ్రిడ్జిలు
- తెలంగాణ వ్యవసాయ ప్రగతి ప్రస్థానంపైన ప్రసంగించాల్సిందిగా మంత్రి కేటీఆర్కు అందిన ప్రతిష్టాత్మక ఆహ్వానం
- తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
- ఈనెల 27న 21 వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక
- పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై విపక్షాల విషప్రచారం
- బీఆర్ఎస్ పోరుతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం.. ఇక ఓబీసీ బిల్లుకోసం గులాబీ పార్టీ ఉద్యమం!
- బండికి మించి నియంతృత్వం.. కిషన్రెడ్డి తీరుతో బీజేపీలో అసంతృప్తి జ్వాల!
- ఎక్కువ అభివృద్ధి చేసి తక్కువ చెబుతున్నాం: మంత్రి పట్నం మహేందర్ రెడ్డి
- ఓబీసీ మహిళలను విస్మరించడం సరికాదు : రష్యా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ కవిత
- సీఎం కేసీఆర్ను కొనియాడిన శ్రీలంక దేశ ప్రధానమంత్రి దినేష్ గుణవర్ధన