తెలంగాణ పోలీసులపై దాడులు చేయాలంటూ పోస్టులతో రెచ్చగొట్టిన బీజేపీ కార్పోరేటర్ పై పలు కేసులు నమోదయ్యాయి. మంగళవారం పశ్చిమ బెంగాల్లో పోలీసులపై దాడి చేసిన విధంగా, ఇక్కడ కూడా పోలీసులపై దాడులు చేయాలని సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెట్టిన బీజేపీ నేత, మున్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డిపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో పలుకేసులు నమోదయ్యాయి. పోలీసులపై దాడులు చేయాలని నర్సింహారెడ్డి పోస్టులు చేశారని, పశ్చిమ బెంగాల్లో జరిగిన విధ్వంసానికి సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో విధ్వంసానికి ప్రేరేపించారనే అభియోగాలతో ఆయనపై నాన్బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి.

