mt_logo

పోడు భూముల సమస్యలపై సమావేశమైన క్యాబినెట్ సబ్ కమిటీ

పోడు భూముల సమస్యకి శాశ్వత పరిష్కారం సూచించేందుకు సీఎం కేసీఆర్, రాష్ట్ర గిరిజన మరియు స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన మంత్రులు ఇంద్ర కరణ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, అజయ్ కుమార్ తో వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ రెండో సమావేశం శుక్రవారం బూర్గుల రామకృష్ణారావు భవన్ లో జరిగింది. ఇతర రాష్ట్రాల్లో పోడు భూముల సమస్యలను ఎలా పరిష్కరిస్తున్నారో వివరాలు తెలుసుకున్న కమిటీ… తెలంగాణలో జిల్లాల వారీగా పోడు భూముల వివరాలు, గిరిజనులు, గిరిజనేతరులు సాగు చేస్తున్న పోడుపై ప్రత్యేకంగా చర్చించింది. దీనిపై త్వరలోనే మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశంలో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *