mt_logo

బిజినెస్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

శంషాబాద్ సమీపంలో షూలిచ్, జీఎంఆర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన బిజినెస్ స్కూల్ ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. అనంతరం నోవాటెల్ హోటల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని సీఎం ప్రసంగించారు. కేసీఆర్ మాట్లాడుతూ, బిజినెస్ స్కూళ్ళకు ప్రభుత్వపరంగా అన్ని ప్రోత్సాహకాలు ఉంటాయని, దేశ ఆర్ధికాభివృద్ధికి నాణ్యమైన విద్య ఎంతో అవసరమని అన్నారు. పరిశ్రమల కోసం 5 లక్షల ఎకరాల భూమి సిద్ధంగా ఉందని, పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *