mt_logo

తెలంగాణ డీజీపీని కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతల దాడులు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ డీజీపీ రవి గుప్తాను కలిసి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. హుజూర్ నగర్, మానకొండూర్, భూపాలపల్లి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులను, జరిగిన హత్యలను డీజీపీ దృష్టికి బీఆర్ఎస్ నాయకుల బృందం తీసుకెళ్ళింది.

నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు జరిపిన దాడిని డీజీపీకి బీఆర్ఎస్ నాయకులు వివరించారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడాన్ని తక్షణమే అడ్డుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు.

డీజీపీని కలిసిన వారిలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైది రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, కోరుకంటి చందర్, భువనగిరి జెడ్పి చైర్మన్ సందీప్ రెడ్డి, సూర్యపేట జడ్పీ చైర్‌పర్సన్ దీపిక, బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు రావుల శ్రీధర్ రెడ్డి, రాకేష్ కుమార్ తదితరులు ఉన్నారు.