mt_logo

దళితబంధుకు మరో రూ.600 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

దళితబంధు లబ్దిదారులకు సీఎం కేసీఆర్ శుభవార్త తెలిపారు. దళితబంధు కోసం మరో రూ.600 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పథకం కింద ఒక దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తోంది. దళితబంధు పథకం కింద ఇప్పటి వరకు ఎంపికైన లబ్ధిదారులందరికి ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో ఎస్సీ కార్పొరేషన్ జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఇప్పటివరకు 38,476 మంది లబ్ధిదారులను ఈ పథకం కింద ఎంపిక చేశారు. ఇక ఇప్పటి వరకు ఎంపికైన లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.3,847.6 కోట్లు జమ చేయగా… తాజాగా మరో రూ.600 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *