mt_logo

నేడు 34వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం

హైదరాబాద్ మరోసారి పుస్తకాల పండుగకు వేదిక అవనుంది. దేశవ్యాప్తంగా ప్రాముఖ్యం పొందిన 34వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ శనివారం ఉదయం తెలంగాణ కళాభారతి ప్రాంగణంలో ప్రారంభం కానుంది. పర్యాటక,క్రీడలు, పురావస్తు, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిధిగా హాజరయ్యి బుక్ ఫెయిర్ ను ప్రారంభించనుండగా, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ సభాధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. కాగా ప్రతీ ఏడాది నిర్వహించే ఈ పుస్తక మేళా.. కరోనా కారణంగా గత సంవత్సరం వాయిదా వేశారు. ఈ ఏడాది దాదాపు 355 స్టాళ్లతో భారీగా కొలువుతీరనున్న బుక్ ఫెయిర్ డిసెంబర్ 18 నుండి 28 వరకు సందడి చేయనుంది. ఏటా లక్షల మంది పుస్తకప్రియులు వివిధ రకాల అరుదైన పుస్తకాల కోసం ఇక్కడికి విచ్చేస్తారు. అయితే కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని బుక్ ఫెయిర్ నిర్వాహకులు పుస్తకప్రియులకు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *