mt_logo

సందర్శకులతో కిటకిటలాడిన ‘ఏక్ శామ్ చార్మినార్ కే నామ్’ సండే-ఫండే కార్యక్రమం

హైదరాబాద్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సండే-ఫండే కార్యక్రమానికి నగరవాసుల నుండి విశేష స్పందన లభిస్తుంది. గత కొన్ని వారాలుగా హుస్సేన్ సాగర్ వద్ద జరుపుతున్న ఈ కార్యక్రమానికి వేలాదిగా సందర్శుకులు తరలి వస్తున్నారు. ఇక చారిత్రక చార్మినార్ వద్ద కూడా ‘ఏక్ శామ్ చార్మినార్‌కే నామ్‌’తో ప్రారంభమైన సండే-ఫండే కార్యక్రమంతో చార్మినార్ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. భారీగా తరలివచ్చిన సందర్శకులతో చార్మినార్‌కు సరికొత్త కళ వచ్చింది. చార్మినార్‌ వద్ద నిర్వహించి స్టేజీ లైవ్‌ షో చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఉర్రుతలూగించింది. మరో వైపు లాడ్‌ బజార్‌లో మట్టి గాజులతోపాటు, వివిధ షాపింగ్ స్టాల్స్.. ఇరానీ చాయ్, తందూరీ చాయ్, బిర్యానీ ఘుమఘుమలు, గృహోపకరణాల కొనుగోళ్లతో సందర్శకులు సందడి చేయగా..  సండే-ఫండే ప్రారంభమైన రెండవ వారం విజయవంతమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *