దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో తెలంగాణ గురుకుల సొసైటీకి విద్యార్థులు విజయ దుందుభి మోగిస్తున్నారు. గురుకుల విద్యాలయాల్లో చదివిన 223 మంది విద్యార్థులు దేశవ్యాప్త గొప్ప విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్, మెడిసిన్లో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సొసైటీ అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ గిరిజన, ఆదివాసీ ఆదిమ తెగల విద్యార్థులను ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలకు ఎంపిక చేసే విధంగా శిక్షణ ఇస్తూ అత్యున్నత కోర్సులలో అడ్మిషన్లు సాధిస్తోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో గిరిజన సంక్షేమ గురుకులాల నుండి విభాగాల్లో 223 మంది విద్యార్థులు గొప్ప, గొప్ప విద్యా సంస్థల్లో సీట్లు సాధించడం పట్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. గత ఆరేళ్లలో(2017 నుంచి 2021) వరకు 1286 మంది విద్యార్థులు ఐఐటి, ఎన్ఐటి, ఐఐఐటి, జిఎఫ్టీఐ, ఎంబీబీఎస్, బిడిఎస్, బిఎస్సీ అగ్రికల్చర్, ఫార్మసీ, ఐఐఎస్ఈఆర్, ఎన్ఐఎస్ఈఆర్ , ప్రతిష్టాత్మక యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు సాధించడం ఎంతో సంతోషకరమన్నారు. విద్య ద్వారానే వికాసం జరుగుతుందని నమ్మిన ముఖ్యమంత్రి కేసిఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక గురుకులాలు పెట్టి, అత్యంత వెనుకబడిన, దళిత, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించడంతో పాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను పెట్టి దేశంలోని ప్రముఖ ప్రవేశ పరీక్షలన్నింటికి అత్యుత్తమ శిక్షణ అందించడం ద్వారా ఈ వర్గాల పిల్లలు గొప్ప, గొప్ప విద్యా సంస్థల్లో ఉత్తమమైన కోర్సులలో సీట్లు సాధిస్తూ, తెలంగాణ రాష్ట్రానికి, గురుకుల విద్యా సంస్థలకు, వారి కుటుంబాలకు మంచిపేరు తీసుకొస్తున్నారని కొనియాడారు.
- Telangana faces injustice in union railway budget too
- Gift A Smile: KTR distributes laptops to 100 students at State Home on his birthday
- Revanth becomes a laughing stock at national level over ‘family politics’ remarks
- No funds for Telangana’s Regional Ring Road in union budget
- Loans waived for farmers who never took them: Kamareddy farmers suspect fraud
- పారిస్ ఒలింపిక్స్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన కేటీఆర్
- శ్రీధర్ బాబు ముందరి కాళ్లకు బంధం వేస్తున్నదెవరు? (పార్ట్-1)
- నీళ్లు వృథా పోతుంటే ఎత్తిపోయకుండా రైతుల నోట్లో మట్టి కొడతారా: కేటీఆర్
- ఆగస్టు 2 గడువు.. తర్వాత 50 వేల మంది రైతులతో కన్నెపల్లి పంప్ను స్టార్ట్ చేస్తాం: కేటీఆర్
- ఎండిపోతున్న ఎల్ఎండీ, మిడ్ మానేరు, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ సహా అన్ని రిజర్వాయర్లు నింపాలి: కేటీఆర్
- ఎన్నికల్లో గ్యారెంటీల గారడీ.. ఇప్పుడు అంకెల గారడీ.. ఇది దశా, దిశా లేని బడ్జెట్: హరీష్ రావు
- ఐఐటీ గౌహతిలో సీటు సాధించిన నిరుపేద విద్యార్థిని దీప్తికి కేటీఆర్ అండ
- ఒక పద్దు లేదు.. పద్ధతి లేదు.. బడ్జెట్ అంతా గ్యాస్.. ట్రాష్: కేసీఆర్
- మేడిగడ్డ బరాజ్లో సమస్య ఎందుకు వచ్చింది? మేడిగడ్డ గురించి తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు
- గిఫ్ట్ ఏ స్మైల్: ఆత్మహత్య చేసుకున్న 13 మంది నేత కార్మికుల కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక సహాయం