mt_logo

తెలంగాణ రైతులను మోసం చేస్తే ఊరుకోం-హరీష్ రావు

తెలంగాణ రైతులకు ఏమీ చేయకుండా అన్నీ చేసినట్లు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. రైతులకు ఉచిత విద్యుత్ అని చెప్పి అసలు కరెంటే సరఫరా చేయలేదని అన్నారు. అసెంబ్లీ లోని మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడిన హరీష్ రావు సీఎం తీరును ఎండగట్టారు. కరెంట్ కోసం రాత్రివేళల్లో ఎదురుచూసి రైతులు పాము, తేలు కాట్లకు గురయ్యి మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. బోర్లకోసం తెలంగాణకు చెందిన రైతులు 40వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, సీమాంధ్రలో అయితే ప్రాజెక్టుల ద్వారా సాగునీరు ఇస్తారని, తెలంగాణలో ఖర్చంతా రైతే భరించాలని విమర్శించారు. పదేపదే సమన్యాయం అంటూ గొంతుచించుకుంటున్న ముఖ్యమంత్రి, చంద్రబాబుకు తెలంగాణ రైతుల కష్టాలు, కన్నీళ్లు కనిపించట్లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *