mt_logo

వరంగల్ ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్తారు- ఎంపీ కవిత

వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో ప్రజలే బీజేపీకి బుద్ధి చెప్తారని టీఆర్ఎస్ ఎంపీ కవిత స్పష్టం చేశారు. పత్తి ధరపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ మాట్లాడుతూ, పత్తికి ఇప్పుడిస్తున్న మద్దతు ధర ఎక్కువని కొందరు బీజేపీ నేతలు మాట్లాడటం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని, స్వామినాథన్ కమిటీ సిఫారసులను అవహేళన చేసిన వారికి వరంగల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. ఎన్నికలకు ముందు మద్దతు ధరకు 50 శాతం అదనంగా ఇస్తామని ప్రధాని మోడీ వాగ్ధానం చేశారు. ఎన్ని విజ్ఞాపనలు చేసినా హామీ అమలు గాలికొదిలేశారని కవిత పేర్కొన్నారు. అందుకే ఇప్పుడు జరుగుతున్న వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ను గెలిపించి ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలని కవిత ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *