mt_logo

వ్యవసాయం దండగన్న బాబు గతచరిత్ర మరిచారా? – ఈటెల

గతంలో వ్యవసాయం దండగన్న చంద్రబాబు చరిత్ర మర్చిపోయి ఈరోజు తెలంగాణ టీడీపీ నేతలు యాత్రలు చేస్తున్నారని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ ఛార్జీలు తగ్గించమన్నందుకు రైతులపై తూటాలు పేల్చిచంపిన టీడీపీ చరిత్రను తెలుగు తమ్ముళ్ళు మర్చిపోయారా? అని, 25 వేల మంది రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబు కారణం కాదా? అని ఈటెల ప్రశ్నించారు.

రైతులను ఆందోళనకు గురిచేయడానికే టీడీపీ బస్సు యాత్ర చేపట్టిందని, ప్రస్తుతం తెలంగాణలో 35 వేల మిలియన్ల కరెంట్ కొరత ఉంటే ప్రభుత్వానికి సహకరించాల్సిందిపోయి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్పత్తి స్టేషన్లలో కూడా తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని, రైతులపై ప్రేముంటే ఆదుకునే ప్రయత్నం చేయండని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *