mt_logo

అర్బన్ ఫారెస్ట్ పార్కులు అద్భుతం : హైకోర్ట్ చీఫ్ జస్టిస్

హైద‌రాబాద్ న‌గ‌రంలోని కేబీఆర్ పార్కులో ఘనంగా ప్ర‌పంచ అట‌వీ దినోత్సవ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారు. హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ స‌తీష్ చంద్ర శ‌ర్మ‌, జ‌స్టిస్ పీ న‌వీన్ రావు, రాజ్య‌స‌భ ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్‌తో పాటు ప‌లువురు పాల్గొని మొక్క‌లు నాటారు. తెలంగాణకు హరితహారం ద్వారా జంగిల్ బచావో- జంగిల్ బడావో నినాదంతో చేపట్టిన కార్యక్రమాలను చీఫ్ జస్టిస్‌కు అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్ వివ‌రించారు. ప్ర‌భుత్వం అభివృద్ధి చేస్తున్న అర్బ‌న్ ఫారెస్ట్ పార్కులు చాలా బాగున్నాయ‌ని చీఫ్ జ‌స్టిస్ ప్ర‌శంసించారు. ఈ సంద‌ర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుల‌తో పాటు ప్ర‌జ‌లంద‌రికీ ప్ర‌పంచ అట‌వీ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పులను ఎదుర్కోవడానికి విరివిగా మొక్కలు నాటడమే స‌రైన మార్గం అని ఆయ‌న పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *