mt_logo

గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ

మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్. గురువారం 783 గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఈ పోస్టులకు జనవరి 18 నుండి ఫిబ్రవరి 16 వరకు అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించాలని కమీషన్ ఉత్తర్వుల్లో పేర్కొంది. పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. కాగా ఈ పోస్టుల్లో అత్యధికంగా సాధారణ పరిపాలన విభాగం (అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్) లో 165 పోస్టులుండగా, ఎంపీడీఓ పోస్టులు 126, నాయబ్ తాసీల్దార్ విభాగంలో 95 పోస్టులున్నాయి. 

గ్రూప్ 2 లో పెరిగిన పోస్టులు : 

మొదట గ్రూప్-2 కేటగిరిలో 663 పోస్టులను గుర్తిస్తూ ప్రభుత్వం ఆగస్టులో జీవో జరీ చేసింది. ఆ తర్వాత మరో ఆరు కేటగిరీలను గ్రూప్-2 కింద కలుపుతూ నవంబర్లో నిర్ణయం తీసుకుంది. ఫలితంగా మరో 120 పోస్టులు పెరిగి మొత్తం 783 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. వరుస నోటిఫికేషన్లు విడుదల అవుతుండగా ఉద్యోగార్థులు పరీక్షలకు సంసిద్ధం అవుతూ బిజీగా ఉంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *