Mission Telangana

8వేల విద్యావాలంటీర్ల భర్తీ!

ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను విద్యావాలంటీర్లతో భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం మంగళవారం సంతకం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7,974 ఉపాధ్యాయ ఖాళీలను విద్యావాలంటీర్లతో భర్తీ చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది.

ఈనెల 15వ తేదీలోగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో భర్తీ ప్రక్రియను పూర్తిచేయనున్నామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చిరంజీవులు తెలిపారు. వీరికి నెలకు రూ. 8000 వేతనం చెల్లించనున్నట్లు, డిగ్రీతో పాటు బీఎడ్ కోర్సు పూర్తి చేసినవారు ఈ పోస్టులకు అర్హులని తెలిపారు. భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు రెండుమూడు రోజుల్లో విడుదల చేస్తామని చిరంజీవులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *