mt_logo

టీఆర్ఎస్ లో చేరిన పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి..

వరంగల్ జిల్లా పరకాల టీడీపీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు భారీ ఎత్తున ఆదివారం నాడు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ ఐక్యంగా ముందుకు పోవాలని తానూ పదేపదే చెప్తున్నానని, టీఆర్ఎస్ లో చేరుతున్న వారంతా తెలంగాణ పునర్నిర్మాణంలో తమ బాధ్యత, కర్తవ్యాన్ని గుర్తించి ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలని వస్తున్నారని అన్నారు.

ధర్మారెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేస్తున్నా, ఆయన మోచేతి నీళ్ళు తాగి, ఆయన చుట్టూ తిరుగుతున్నారే తప్ప తెలంగాణ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ఒక పార్టీని తిట్టేందుకు ప్యాకేజీలు మాట్లాడుకుని విమర్శలు చేస్తున్నారని, చంద్రబాబు ఏపీకే ముఖ్యమంత్రి అనే విషయాన్ని తెలంగాణ టీడీపీ నేతలు ఇప్పటికైనా గుర్తించి తెలంగాణ పునర్నిర్మాణం కోసం, ఇక్కడి ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలని టీడీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. ఎన్నో అవమానాలు, అష్టకష్టాలు పడి కేసీఆర్ ప్రాణాలు ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామిగా ఉండాలనే తాను టీఆర్ఎస్ లో చేరినట్లు ధర్మారెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *