గడిచిన రెండు రోజుల వ్యవధిలోనే అన్ని పార్టీలనుండి భారీగా వలసలు రావడం, రాబోయే వారం రోజుల్లో మరికొంతమంది రానున్నట్లు అందిన సమాచారంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్ధుల తొలి జాబితాను ప్రకటించడం ప్రస్తుతం వాయిదా వేసామని పార్టీ నేతలు తెలిపారు. ఖమ్మం జిల్లా వైసీపీ నేత జలగం వెంకట్రావ్, కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గానికి చెందిన పుట్ట మధు సోమవారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితో పాటు భారీ ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా పార్టీలో చేరిన సందర్భంగా కేసీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జలగం వెంకట్రావ్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని బలమైన శక్తిగా మార్చి వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచి చూపిస్తామని, ఖమ్మం జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ వెంట నడవటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. పుట్ట మధు మాట్లాడుతూ, తెలంగాణలో సీమాంధ్ర పార్టీలకు స్థానం లేకుండా చేయాలనే తాను టీఆర్ఎస్ లో చేరుతున్నానని, కేసీఆర్ ద్వారానే తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. రెండుమూడు రోజుల్లో ఖమ్మం జిల్లాలోని టీడీపీకి చెందిన కీలక నేత టీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం. మహబూబ్ నగర్ కు చెందిన ఒక ఎమ్మెల్యే, వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు కొండా దంపతులు కూడా టీఆర్ఎస్ లోకి రావడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. వీరే కాకుండా మెదక్ జిల్లా నుండి టీడీపీ హయాంలో మంత్రిగా పని చేసిన నాయకుడు కూడా టీఆర్ఎస్ లోకి రానున్నారు. వలసలపర్వం భారీగా కొనసాగడం, సీపీఐ, న్యూ డెమోక్రసీ పార్టీలతో పొత్తులపై అవగాహన కుదరకపోవడంతోనే జాబితాను వాయిదా వేయాల్సి వచ్చినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. టిక్కెట్లు ఖరారైన అభ్యర్థులకు మాత్రం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి ప్రచారం ప్రారంభించుకోవచ్చని, గెలిచి రావాలని అన్నట్లు తెలిసింది. అయితే అభ్యర్థుల జాబితాపై కొన్ని ఛానళ్ళు, పత్రికల్లో వస్తున్న రకరకాల వార్తలను ఖండిస్తూ, పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించడానికి ఇంకా వారం రోజుల సమయం పడుతుందని పార్టీ నేతలు తెలిపారు.
- Stunning clicks of rich wildlife in HCU
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్