mt_logo

తెలంగాణ తల్లి, అమరవీరుల స్థూపాలకు ముసుగులు!

తెలంగాణ తల్లి, చాకలి ఐలమ్మ, అమరవీరుల విగ్రహాలకు అందరు రాజకీయనాయకుల విగ్రహాలతోపాటే ముసుగులు వేసి వరంగల్ జిల్లా నర్సంపేట సీమాంధ్ర అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు.మున్సిపల్, స్థానిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల అధికారులు పార్టీల జెండా గద్దెలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, గోడలపై రాతలు తొలగించకుండా ఏ రాజకీయ పార్టీకి చెందని ఈ విగ్రహాలపై ముసుగులు వేయడం తెలంగాణవాదుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. తెలంగాణ ప్రజలంతా తల్లిగా భావించే విగ్రహానికి ఇలా ముసుగు వేయడం, తెలంగాణ తల్లి అని తెలిపే శిలాఫలకానికి సున్నం వేయడం పట్ల వారు మండిపడుతున్నారు. అమరవీరులు ఏ పార్టీకి చెందినవారు కాదని, అన్ని పార్టీల నేతలు శ్రద్ధాంజలి ఘటిస్తారని, అలాంటి అమరవీరుల స్థూపానికి ముసుగు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఫారెస్ట్ కార్యాలయం సెంటర్లో చాకలి ఐలమ్మ, అమరుడు రాజ్ కుమార్ చారి విగ్రహాలకు కూడా ముసుగులు వేశారు. కొంతమంది ఆంధ్రా అధికారులే కావాలని తెలంగాణ విగ్రహాలపై ముసుగులు వేయమని ఆదేశాలు ఇచ్చినట్లు తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *